Aadavallu Meeku Joharlu Trailer Review | శర్వానంద్ సినిమాలు వస్తున్నాయంటే రెండు మూడేళ్ల కింద మంచి క్రేజ్ ఉండేది. మార్కెట్ కూడా అప్పట్లో రూ.25 కోట్ల వరకు పెంచుకున్నాడు. కానీ కొన్నేళ్లుగా ఆ అంచనాలు అందుకోవడంలో దారుణంగా విఫలం అవుతున్నాడు ఈ హీరో. ప్రస్తుతం ఈయన నటిస్తున్న ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమా మార్చి 4న విడుదల కానుంది. ఈ సినిమా ట్రైలర్ విడుదలైందిప్పుడు. ఇది చూసిన తర్వాత సినిమా కచ్చితంగా విజయం అందుకునేలా ఉందనే నమ్మకం అందరిలోనూ కనిపిస్తుంది. మరీ ముఖ్యంగా ట్రైలర్ అంతా చాలా ఆసక్తికరంగా ఉంది. కిశోర్ తిరుమల కచ్చితంగా మ్యాజిక్ చేసేలా కనిపిస్తున్నాడు. శర్వానంద్ కూడా ఈ సినిమాపై అంచనాలు పెట్టుకున్నాడు.
5 ఏండ్ల కిందట సంక్రాంతికి శతమానం భవతి సినిమాతో రూ.34 కోట్ల షేర్ వసూలు చేసిన శర్వానంద్.. ఆ తర్వాత మళ్లీ ఒక్క సినిమాతో కూడా కనీసం రూ.15 కోట్ల షేర్ అందుకోలేకపోయాడు. దీన్నిబట్టి శర్వా మార్కెట్ ఎంత దారుణంగా పడిపోయిందో అర్థం చేసుకోవచ్చు. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఈయన రెండు సినిమాలతో వస్తున్నాడు. అందులో ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. దీనిపై అందరికీ నమ్మకం పెరగడానికి కారణం దర్శకుడు కిశ్ర్ తిరుమల. నేను శైలజ, చిత్రలహరి లాంటి సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న కిశ్ర్.. ఇప్పుడు ఆడవాళ్లు మీకు జోహార్లు అంటూ శర్వానంద్తో కలిసి వస్తున్నాడు. మార్చి 4న ఈ సినిమా విడుదల కానుంది.
పెద్దగా పోటీ లేకుండా వస్తున్న ఈ సినిమాతో మళ్లీ ఫామ్లోకి రావాలని చూస్తున్నాడు శర్వానంద్. రష్మిక మందన్న ఈ సినిమాకు స్పెషల్ అట్రాక్షన్. ట్రైలర్లోనూ ఈమె డైలాగులు అదిరిపోయాయి. నువ్వెక్కడ దొరికావురా సామీ నాకు అంటూ శర్వాతో రష్మిక చెప్పే డైలాగ్ ట్రైలర్లో బాగా పేలింది. ఈ సినిమాపైనే శర్వానంద్ ఆశలన్నీ ఉన్నాయి. రాధిక, ఖుష్బూ, ఊర్వశి లాంటి సీనియర్ హీరోయిన్లు ఇందులో నటించారు. దీంతో పాటు ఒకే ఒక జీవితం అనే మరో సినిమా చేస్తున్నాడు శర్వానంద్.