బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ మరో సీక్వెల్కు సిద్ధమవుతున్నారు. సునీల్ శెట్టితో కలిసి ఆయన నటించిన ‘హేరా ఫేరీ’ సినిమా ప్రేక్షకుల్ని బాగా నవ్వించి ఘన విజయం సాధించింది. 2000 సంవత్సరంలో విడుదలైన ఈ సినిమాకు ఆరేళ్ల తర్వాత సీక్వెల్ ‘ఫిర్ హేరా ఫేరీ’ వచ్చింది. ఇప్పుడు మూడో సినిమాకు సన్నాహాలు మొదలయ్యాయి. ఈ చిత్రంలోనూ అక్షయ్ కుమార్, సునీల్ శెట్టి, పరేష్ రావల్ ప్రధాన పాత్రలు పోషించనున్నారు. ఈ సినిమాకు దర్శకుడు ఎవరనేది త్వరలో వెల్లడిస్తామని నిర్మాత ఫిరోజ్ నదియావాలా వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ…‘గత రెండు సినిమాలు ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోయేలా పేరు తెచ్చుకున్నాయి. ఆ చిత్రాల గొప్పదనం ఉపయోగించుకునేందుకు ఈ కొత్త సినిమా నిర్మించడం లేదు. మంచి కథ, పాత్రలు ఉండేలా జాగ్రత్తపడుతున్నాం. దర్శకుడు ఎవరనేది త్వరలో వెల్లడిస్తాం’ అన్నారు.