Hema Malini | ప్రముఖ బాలీవుడ్ నటుడు ధర్మేంద్ర మృతి చెందారంటూ మంగళవారం ఉదయం మీడియాలో వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ వార్తలను ఖండించింది ధర్మేంద్ర భార్య నటి హేమ మాలిని. ధర్మేంద్ర చికిత్సకు స్పందిస్తూ కోలుకుంటున్న సమయంలో ఆయన మరణించారంటూ వచ్చిన పుకార్లపై ఆమె తన ఆవేదనను వ్యక్తం చేసింది.
ధర్మేంద్ర మృతి చెందారంటూ వస్తున్న వార్తలపై హేమా మాలిని స్పందిస్తూ.. ప్రస్తుతం జరుగుతున్నది క్షమించరానిది! చికిత్సకు స్పందించి, కోలుకుంటున్న వ్యక్తి గురించి బాధ్యత కలిగిన ఛానెల్లు తప్పుడు వార్తలను ఎలా ప్రచారం చేయగలవు? ఇది అత్యంత అగౌరవంగా, బాధ్యతారాహిత్యంగా ఉంది. దయచేసి మా కుటుంబానికి ప్రైవసీతో పాటు అవసరానికి తగిన గౌరవం ఇవ్వండి అని హేమమాలిని రాసుకోచ్చింది. ప్రస్తుతం ధర్మేంద్ర ముంబైలోని బ్రీచ్ క్యాండీ హాస్పిటల్లో చికిత్స పొందుతుండగా.. ధర్మేంద్ర ఆరోగ్యంపై ఇప్పటికే అతడి కూతురు నటి ఈషా డియోల్ సోషల్ మీడియా వేదికగా క్లారిటీనిచ్చింది.
What is happening is unforgivable! How can responsible channels spread false news about a person who is responding to treatment and is recovering? This is being extremely disrespectful and irresponsible. Please give due respect to the family and its need for privacy.
— Hema Malini (@dreamgirlhema) November 11, 2025