‘మా’ (మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్) ఎన్నికలు (Maa Elections) దగ్గరపడుతున్న కొద్దీ ఉత్కంఠ రేకెత్తిస్తున్నాయి. ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు మధ్యే ప్రధానంగా పోటీ నెలకొనడంతో..ఈ రెండు ప్యానెళ్ల సభ్యుల మధ్య విమర్శల పర్వం కొనసాగుతోంది. తాజాగా ప్రకాశ్ రాజ్ ప్యానెల్ నుంచి నటి హేమ (Hema).. నరేశ్ (Naresh), కరాటే కల్యాణి (Karate Kalyani) పై మా ఎన్నికల అధికారి కృష్ణమోహన్ కు ఫిర్యాదు చేశారు. ఈ ఆయనకు హేమ ఓ లేఖ రాశారు. కరాటే కల్యాణి, నరేశ్ తనపై అసభ్యకర వ్యాఖ్యలు చేశారని, అభ్యంతర కర వ్యాఖ్యలతో ఓ వీడియో కూడా విడుదల చేశారని హేమ ఆరోపించారు.
తన ఫొటోలు మార్ఫింగ్ చేసి దుష్ప్రచారం చేస్తున్నారని, నరేశ్, కరాటే కల్యాణిలపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల అధికారికి విజ్ఞప్తి చేశారు. సినీ రంగానికి చెందిన నటీనటుల ఫొటోలను మార్ఫింగ్ చేసి, వాటికి అసభ్యకర వ్యాఖ్యలను జోడించి కొన్ని యూట్యూబ్ ఛానల్స్ వాటిని పోస్ట్ చేస్తున్నాయి. గతంలో నేను ఈ విషయంపై సైబర్ సెల్ పోలీసులకు కూడా ఫిర్యాదు చేశాను. ఆ తర్వాత ఇలాంటి పోస్టింగులు తగ్గాయి.
కుమారి కల్యాణి ఈ ఘటనకు సంబంధించిన విషయాన్ని ఓ వీడియోలో ప్రస్తావిస్తూ..నేను పోలీసుల వద్దకు వెళ్లినపుడు వారు నాకు సంబంధించిన కొన్ని అసభ్యకరమైన ఫొటోలను సోషల్ మీడియా నుంచి తొలగించాలని సలహా ఇచ్చినట్టు వ్యాఖ్యానించారు. దీన్ని నరేశ్ కూడా సమర్థించారు. నేను అమర్యాదకరమైన ఫొటోలను గ్రూపులో పెట్టి చట్ట వ్యతిరేక కార్యకలాపాలను పాల్పడినట్టు కూడా కరాటే కల్యాణి ఆ వీడియోలో పేర్కొన్నారు. అంతేకాకుండా నాకు వ్యతిరేకంగా వారి వద్ద ఆధారాలున్నాయని, వాటిని బయటపెడతామని బెదిరిస్తూ, బ్లాక్ మెయిల్ చేస్తున్నారని హేమ ఆరోపించారు. నరేశ్ కూడా ఈ వ్యంగ్య ధోరణిలోనే నన్ను అగౌరవపరిచేలా, నా వ్యక్తిత్వాన్ని కించపరిచేలా మాట్లాడారని ఆరోపించారు.
Faria abdullah: రోడ్డుపై జాతి రత్నాలు బ్యూటీ తీన్మార్ డ్యాన్స్.. వీడియో వైరల్
MAA Elections | ‘మా’ ఎన్నికలపై నటుడు రవిబాబు సంచలన వ్యాఖ్యలు
Chiranjeevi | గర్వంగా చెబుతున్నా అది నా సొంత డబ్బు: చిరంజీవి