రామ్ కార్తీక్ హీరోగా, హెబ్బాపటేల్ హీరోయిన్గా రూపొందుతున్న చిత్రం ‘తెలిసినవాళ్ళు’. విప్లవ్ కోనేటి దర్శకత్వంలో సిరెంజ్ సినిమా పతాకంపై కేఎస్వీ సమర్పణలో ఈ చిత్రం నిర్మాణం జరుపుకుంటున్నది. ఇటీవల ఈ చిత్రంలోని ‘శశివదనే’ అనే లిరికల్ సాంగ్ను విడుదల చేశారు. దర్శకుడు మాట్లాడుతూ ‘ ఇటీవల విడుదల చేసిన టీజర్కు, సాంగ్కు అందరి నుంచి మంచి స్పందన లభించింది. సినిమా కూడా తప్పకుండా అందరి ఆదరణ పొందుతుందనే నమ్మకం ఉంది’ అన్నారు. నరేష్, పవిత్ర లోకేష్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: శ్రీచరణ్ పాకాల