యశ్విన్, దినేష్తేజ్, అజయ్, బాలాదిత్య, పూజిత పొన్నాడ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘కథా కేళి’. సతీష్ వేగేశ్న దర్శకుడు. ఆదివారం ఈ చిత్ర లోగోను అగ్ర నిర్మాత దిల్ రాజు ఆవిష్కరించారు. టీజర్ను హరీష్శంకర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన దిల్రాజు.. విభిన్న కథాంశంతో తెరకెక్కించిన ఈ చిత్రం విజయవంతం కావాలని అన్నారు.
దర్శకుడు సతీష్ వేగేశ్న మాట్లాడుతూ ‘సాధారణంగా అందరూ దెయ్యం కథలను చెబుతారు. కానీ దెయ్యానికే కథ చెప్పాల్సి వస్తే ఎలా ఉంటుందన్నదే ఈ సినిమా పాయింట్. హారర్ కామెడీ కథాంశంతో అందరికి కొత్త అనుభూతిని పంచుతుంది’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: దాము నర్రావుల, సంగీతం: ఎస్.కె.బాలచంద్రన్, రచన-దర్శకత్వం: సతీష్ వేగేశ్న.