Hanuman | రాముడికి ఇచ్చిన మాటను హనుమాన్ టీమ్ నిలబెట్టుకుంది. చెప్పినట్టుగానే హనుమాన్ సినిమా కలెక్షన్లలో కొంత మొత్తాన్ని అయోధ్య రామమందిరానికి విరాళంగా ఇచ్చింది. నిన్న ప్రదర్శించిన ప్రీమియర్ షోల ద్వారా వచ్చిన ఆదాయంలో రూ.14.25 లక్షలను విరాళంగా అందించింది.
తేజ సజ్జా ప్రధాన పాత్రలో ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన హనుమాన్ సినిమా ఇవాళ (జనవరి 12న) విడుదలైంది. ముందు నుంచి ఈ సినిమాకు వచ్చిన హైప్ దృష్ట్యా.. సినిమా రిలీజ్కు ఒక్క రోజు ముందు అంటే.. జనవరి 11వ తేదీన భారీగా ప్రీమియర్ షోలు వేశారు. దాదాపు 300 థియేటర్లలో సినిమాను ప్రదర్శించారు. అయితే హనుమాన్ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ సమయంలో చిత్ర యూనిట్ కీలక నిర్ణయం తీసుకుంది. తమ సినిమాకు అమ్ముడుపోయే ప్రతి టికెట్లో 5 రూపాయలను అయోధ్య రామమందిరానికి విరాళంగా ఇస్తామని ప్రకటించింది. ఇప్పుడు అన్నమాట ప్రకారం.. నిన్న ప్రీమియర్ షోల ద్వారా వచ్చిన ఆదాయంలో రూ.14.25 లక్షలను రామమందిరానికి విరాళంగా ఇచ్చింది. ఈ సినిమా ప్రదర్శితమైనన్ని రోజులు కూడా అమ్ముడుపోయే ప్రతి టికెట్పై రూ.5ను విరాళంగా ఇవ్వనుంది.