తేజ సజ్జా హీరోగా ప్రశాంత్వర్మ దర్శకత్వంలో రూపొందిన ‘హను-మాన్’ చిత్రం ఇటీవల విడుదలై చక్కటి ప్రేక్షకాదరణ సొంతం చేసుకుంది. అయోధ్యలోని రామమందిరానికి ఈ సినిమాకు సంబంధించిన ప్రతి టికెట్ నుంచి 5 రూపాయలు విరాళంగా ఇస్తామని చిత్ర బృందం గతంలోనే ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రీమియర్ షోల ద్వారా విక్రయించిన టికెట్ల ద్వారా లభించిన 14లక్షల 85వేల రూపాయలకుపైగా చెక్కును ఇప్పటికే అందించారు. తాజాగా ఇప్పటి వరకు విక్రయించిన మొత్తం టిక్కెట్ల నుంచి 2కోట్ల 66లక్షల మొత్తాన్ని చిత్ర బృందం అయోధ్య రామమందిరం కోసం అందించాలమని పేర్కొంది.