తేజ సజ్జా కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘హను-మాన్’. ప్రశాంత్వర్మ దర్శకుడు. సూపర్హీరో కథాంశంతో తెరకెక్కిస్తున్నారు. అమృత అయ్యర్ కథానాయిక. కె.నిరంజన్ రెడ్డి నిర్మాత. ఈ నెల 15న టీజర్ను విడుదల చేయబోతున్నారు. సోమవారం అనౌన్స్మెంట్ పోస్టర్ను రిలీజ్ చేశారు. ఇందులో హీరో తేజా సజ్జా ఒక కొండపై నిలబడి శంఖం పూరిస్తూ కనిపిస్తున్నాడు. దర్శకుడు మాట్లాడుతూ ‘ఈ సినిమాలో తేజ సజ్జా ప్రత్యేక శక్తులు కలిగిన సూపర్హీరోగా కనిపిస్తారు.
దుష్టశక్తులపై ఆయన చేసే పోరాటం, విన్యాసాలు అద్భుతంగా అనిపిస్తాయి. తొలి ఒరిజినల్ సూపర్హీరో చిత్రంగా ఆకట్టుకుంటుంది’ అన్నారు. వరలక్ష్మీ శరత్కుమార్, వినయ్ రాయ్, గెటప్ శ్రీను, సత్యరాజ్, దీపక్శెట్టి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: దాశరథి శివేంద్ర, సంగీతం: అనుదీప్ దేవ్, గౌరా హరి కృష్ణసౌరభ్, నిర్మాణ సంస్థ: ప్రైమ్షో ఎంటర్టైన్మెంట్, రచన-దర్శకత్వం: ప్రశాంత్వర్మ.