పర్యావరణ సంపదను పరిరక్షించుకునేందుకు రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన అద్భుత కార్యక్రమం ‘గ్రీన్ ఇండియా చాలెంజ్’. ఎంతోమంది సెలబ్రిటీలు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యులు అవుతున్నారు. ఆదివారం బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తాజ్వాల, హీరో విష్ణు విశాల్ దంపతులు ‘గ్రీన్ ఇండియా చాలెంజ్’ కార్యక్రమంలో పాల్గొన్నారు. .జూబ్లీహిల్స్లోని జీహెచ్ఎంసీ పార్కులో మొక్కలు నాటారు. ఇంత మంచి కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందన్న వీరు..ప్రతి ఒక్కరూ ‘గ్రీన్ ఇండియా చాలెంజ్’ కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. హీరో రవితేజ, ఎఫ్ఐఆర్ చిత్ర దర్శకుడు మను ఆనంద్ లకు విష్ణు విశాల్ ‘గ్రీన్ ఇండియా చాలెంజ్’ విసిరారు. ఈ సెలబ్రిటీ దంపతులకు ‘గ్రీన్ ఇండియా చాలెంజ్’ కో ఫౌండర్ రాఘవ వృక్షవేదం పుస్తకాన్ని బహూకరించారు.