Gunturu Kaaram | టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu), మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas ) కాంబోలో వచ్చిన తాజా చిత్రం ‘గుంటూరు కారం’ (Gunturu Kaaram). అతడు, ఖలేజా సినిమాల తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో ఈ సినిమా రావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమా సంక్రాంతి కానుకగా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. మొదటిరోజే ఈ సినిమాకు కొంచెం మిక్స్డ్ టాక్ రావడంలో కలెక్షన్ల మీద ప్రభావం పడుతుందని ట్రేడ్ వర్గాలు భావించాయి. కానీ ఆ అంచనాలను తలకిందులు చేస్తూ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది.
ఇక ఈ సినిమా ఫస్ట్ వీక్ కలెక్షన్లు చూసుకుంటే.. వారం రోజుల్లో వరల్డ్ వైడ్గా రూ.212 కోట్ల వసూళ్లు రాబట్టింది. ఇక రానున్న రెండు రోజులు కూడా వీకెండ్ వస్తుండటంతో ఈ కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశముంది. ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమాలో శ్రీలీల, మీనాక్షీ చౌదరీలు హీరోయిన్లుగా నటించారు. రమ్యకృష్ణ తల్లి పాత్రలో నటించింది. హారికా అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై చినబాబు ఈ సినిమాను నిర్మించాడు.
రమణగాడి 𝗦𝗨𝗣𝗘𝗥 𝗦𝗔𝗡𝗞𝗥𝗔𝗡𝗧𝗛𝗜 𝗕𝗟𝗢𝗖𝗞𝗕𝗨𝗦𝗧𝗘𝗥 sets the BOX-OFFICE ablaze!! 🔥🕺#GunturKaaram grosses over a SMASHING 𝟐𝟏𝟐 𝐂𝐑 Worldwide in it’s 1st Week ~ 𝗔𝗟𝗟 𝗧𝗜𝗠𝗘 𝗥𝗘𝗖𝗢𝗥𝗗 (Highest for a regional cinema)💥💥
Watch #BlockbusterGunturKaaram at… pic.twitter.com/KyXpMsIwHf
— Haarika & Hassine Creations (@haarikahassine) January 19, 2024