ఒకప్పుడు ఇలియానా అంటే కుర్రకారు కలల సుందరి. ఓ అయిదారేళ్లు తెలుగుతెరపై తన హవా నడిచిందని చెప్పొచ్చు. కానీ ఉన్నట్టుండి తెరమరుగైపోయింది. ఈ విషయంపైనే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వివరణ ఇచ్చింది ఇలియానా. ‘ 2006లో నా ‘దేవదాసు’ విడుదలైంది. అప్పట్నుంచీ ఆరేళ్ల పాటు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో నేను బిజీ బిజీ. 2012లో ‘బర్ఫీ’ రూపంలో బాలీవుడ్ నుంచి పిలుపు వచ్చింది. మంచి అవకాశం.. వదులుకోకూడదని ఓకే చెప్పేశాను. ఆ సినిమా విడుదలై మంచి విజయాన్ని సాధించింది. ఓ విధంగా నేను పరిశ్రమలో వెనుకపడిపోవడానికి కారణం ‘బర్ఫీ’నే.
ఆ సినిమా విజయం సాధించడం వల్ల, ఇక నేను తెలుగులో నటించనని టాలీవుడ్ దర్శక, నిర్మాతలు ఫిక్స్ అయిపోయారు. దాంతో నాకు రావాల్సిన అవకాశాలు వేరొకరికి వెళ్లిపోయాయి. అందరూ అనుకున్నట్టే బాలీవుడ్లో నాకు మంచి అవకాశాలే వచ్చాయి. కానీ, నేను ఏ పాత్ర ఒప్పకున్నా వంద శాతం ఆ పాత్రకు న్యాయం చేయాలని కోరుకుంటాను. అందుకే.. పాత్రల్ని సెలక్టివ్గా ఎంచుకోవడం మొదలుపెట్టాను.
ఈ క్రమంలో వచ్చిన మంచి అవకాశాలను కూడా వదులుకున్నా. ఆ సమయంలో నేను వదులుకున్న బాలీవుడ్ సినిమాలు బాగా ఆడి, అందులో నటించిన వాళ్లకు మంచి పేరు తెచ్చాయి. కాలక్రమేణా, బాలీవుడ్లో కూడా నాకు అవకాశాలు తగ్గాయి. ఇదంతా తలరాత అంతే.. విద్యాబాలన్, నేను కలిసి నటించిన ‘దో ఔర్ దో ప్యార్’ చిత్రంతో చాలా విరామం తర్వాత నాకు సక్సెస్ వచ్చింది. ప్రస్తుతం ఆ ఆనందంలో ఉన్నాను.’ అంటూ చెప్పుకొచ్చింది గోవాభామ ఇలియానా.