వచ్చే ఏడాది ఆస్కార్ అవార్డుల కోసం మన దేశం తరపున అఫీషియల్ ఎంట్రీగా గుజరాత్ సినిమా ‘ఛలే షో’ ఎంపికైంది. తెలుగు సినిమా ‘ఆర్ఆర్ఆర్’, బాలీవుడ్ మూవీ ‘ద కశ్మీర్ ఫైల్స్’కు ఈ అవకాశం దక్కుతుందని విశ్లేషకులు భావించారు. అనూహ్యంగా ఈ రెండు చిత్రాలను దాటేసి ‘ఛలే షో’ ఆస్కార్కు అధికారికంగా వెళ్లనుంది. కామెడీ డ్రామా కథతో దర్శకుడు పాల్ నలిన్ ఈ చిత్రాన్ని రూపొందించారు. భవీన్ రబరి, భవేష్ శ్రీమలి, రిచా మీనా, దిపెన్ రావల్ కీలక పాత్రల్లో నటించారు.
గతేడాది తెరకెక్కిన ఈ సినిమా ‘లాస్ట్ ఫిల్మ్ షో’ పేరుతో న్యూయార్క్ ట్రైబెకా ఫిల్మ్ ఫెస్టివల్, బీజింగ్ ఫిల్మ్ ఫెస్టివల్, స్పెయిన్ వల్లడాయిడ్ ఫిల్మ్ ఫెస్టివల్స్లో ప్రదర్శితమై పురస్కారాలు గెల్చుకుంది. తొమ్మిదేళ్ల గ్రామీణ బాలుడు సమయ్, తన ఊరి సినిమాహాల్లోని ప్రొజెక్టర్ టెక్నీషియన్కు కొంత లంచం ఇచ్చి ఆ ప్రొజక్షన్ గదిలోకి ప్రవేశం సంపాదిస్తాడు. వేసవి సెలవులు మొత్తం అక్కడ ప్రదర్శితమయ్యే సినిమాలన్నీ చూ స్తాడు. అవి ఆ బాలుడి జీవితంపై ఎలాంటి ప్రభావం చూపించాయి అ నేది సహజత్వంతో తె రకెక్కించారు.