లాక్డౌన వలన థియేటర్స్ మూతపడడంతో ప్రేక్షకులకి వినోదమే కరువైంది. ఈ క్రమంలో సోషల్ మీడియాలో హీరో, హీరోయిన్స్ పాత ఫొటోలు బయటకు తీస్తూ వాటిని చూసి మురిసిపోతున్నారు. గత ఏడాది నుండి సోషల్ మీడియాలో త్రోబ్యాక్ ఫొటోలు తెగ చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా ఓ స్టార్ హీరోయిన్కి సంబంధించి ఫొటోలు వైరల్ కాగా, అందులో కనిపించే హీరోయిన్ ఎవరని కాంటెస్ట్ పెట్టారు.
ఇప్పటిలానే చిన్నప్పుడు కూడా ఉన్న సాయి పల్లవిని చాలా మంది గుర్తు పడుతున్నారు. ఫిదా సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసిన సాయి పల్లవి.. ప్రస్తుతం తెలుగులో శేఖర్ కమ్ముల లవ్ స్టోరీ సినిమాతో పాటు వేణు ఊడుగుల విరాట పర్వం సినిమాలతో బిజీగా ఉంది. లవ్ స్టోరీ చిత్రంలో సారంగ దరియా పాటకు సాయి పల్లవి అదిరిపోయే డ్యాన్స్ చేయగా, ఆ పాట ఇప్పుడు 30 కోట్ల వ్యూస్ రాబట్టింది. అంటే 300 మిలియన్స్ అన్నమాట.
శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తున్న లవ్ స్టోరీ సినిమాలోని ఈ పాటని సుద్దాల అశోక్ తేజ రాయగా, మంగ్లీ పాడింది. పవన్ సిహెచ్ ఈ పాటకు సంగీతం అందించాడు. తెలంగాణ జానపదం నుంచి మూలాలు తీసుకుని దీనికి సినిమాటిక్ టచ్ ఇచ్చాడు సుద్దాల.గతంలో సాయి పల్లవి డ్యాన్స్ చేసిన రౌడీ బేబీ మంచి ఆదరణ పొందగా, ఈ పాట 1300 మిలియన్ వైపు పరుగులు తీస్తుంది.