ప్రతాప్ పోతన్, అరవింద్ కృష్ణ, అలీ రెజా, ఊర్వశీరాయ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ‘గ్రే’. అద్వితీయ మూవీస్ పతాకంపై కిరణ్ కాళ్లకూరి నిర్మాణంలో దర్శకుడు రాజ్ మాదిరాజు తెరకెక్కిస్తున్నారు. త్వరలో విడుదలకు సిద్ధమవుతున్నది. ఈ సందర్భంగా గురువారం హైదరాబాద్లో నిర్వహించిన కార్యక్రమంలో దర్శకుడు రాజ్ మాదిరాజు మాట్లాడుతూ…‘గతంలో మనదేశంలో 12 మంది అణుశాస్త్రవేత్తలు అదృశ్యమయ్యారు. వీరు ఏమయ్యారనేది తెలుసుకునేందుకు విదేశీ నిఘా సంస్థలు ఇన్వెస్టిగేషన్ చేపట్టాయి. ఈ ఘటనల నుంచి పుట్టినదే మా చిత్ర కథ. పూర్తిగా బ్లాక్ అండ్ వైట్లో చిత్రీకరించిన సినిమా ఇది. స్పై డ్రామాగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది’ అన్నారు.