‘కేంద్రప్రభుత్వం అధీనంలో ఉండే ఎన్ఎఫ్డీసీలోకి ఇతర కళాత్మక రంగాలను విలీనం చేయడం అన్ని రాష్ర్టాల హక్కులను కాలరాయడమే అవుతుంది. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంటున్న తెలుగు సినిమాకు ఈ విలీన చర్య ఎంతో నష్టదాయకం’ అన్నారు తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఛైర్మన్ డా.ప్రతాని రామకృష్ణ గౌడ్ ఫిలిం డివిజన్, నేషనల్ ఫిలిం ఆర్కైవ్లతో పాటు, ఫిలిం ఫెస్టివల్ డైరెక్టరేట్, చిల్డ్రన్ ఫిలిం సొసైటి ఆఫ్ ఇండియాలను ఎన్ఎఫ్డీసీలో విలీనం చేయడం పట్ల ఆయన స్పందిస్తూ ‘ఇలా కళారంగ సంస్థల్ని విలీనం చేయడం వల్ల కళాత్మక విలువలు తగ్గిపోతాయి.
బీజేపీ ప్రభుత్వం అన్ని రాష్ట్రాల ఎఫ్డీసీలను నిర్వీర్యం చేయాలనే సంకల్పంతో ఇలాంటి నిర్ణయం తీసుకుంది. కళారంగాల పట్ల ఎటువంటి అవగాహన లేకుండా ఇలాంటి డెసిషన్ తీసుకోవడం బాధాకరం’ అన్నారు.