“భీమా’ ప్రేక్షకులకు గొప్ప థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ను అందిస్తుంది. ఎమోషన్స్, యాక్షన్ అంశాలు సమపాళ్లలో కుదిరాయి. డైలాగ్స్ అద్భుతంగా ఉన్నాయని ప్రశంసలొస్తున్నాయి’ అన్నారు గోపీచంద్. ఆయన కథానాయకుడిగా ఏ.హర్ష దర్శకత్వంలో కె.కె.రాధామోహన్ నిర్మించిన ‘భీమా’ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సందర్భంగా శనివారం నిర్వహించిన సమావేశంలో గోపీచంద్ మాట్లాడుతూ ‘ఈ సినిమాకు గొప్ప కథతో పాటు ప్రతిభావంతులైన సాంకేతిక నిపుణులు కుదిరారు.
నిర్మాత రాధామోహన్గారు ఎక్కడా రాజీ పడకుండా తెరకెక్కించారు. రవి బస్రూర్ మ్యూజిక్ సినిమాకు వెన్నెముకగా నిలిచింది. ైక్లెమాక్స్ ఘట్టంలో థియేటర్లు చప్పట్లతో మార్మోగిపోతున్నాయి. నా కెరీర్లో ఎంతో ప్రత్యేకమైన చిత్రమిది’ అన్నారు. ‘విడుదలైన అన్ని కేంద్రాల్లో సినిమాకు అద్భుతమైన స్పందన లభిస్తున్నది. అన్కాంప్రమైజ్డ్గా సినిమాను తెరకెక్కించాం. ఆ క్వాలిటీ తెరపై కనిపిస్తున్నది. ‘పంతం’ సినిమా నుంచి గోపీచంద్తో మా అనుబంధం కొనసాగుతున్నది’ అని నిర్మాత తెలిపారు. ప్రతి సన్నివేశం కొత్తదనంతో ఆకట్టుకుంటున్నదని, రెండు పాత్రల్లో గోపీచంద్ అద్భుతమైన నటన కనబరిచాడని దర్శకుడు ఏ.హర్ష అన్నారు.