గోపీచంద్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘భీమా’. ఏ.హర్ష దర్శకత్వంలో శ్రీసత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కేకే రాధామోహన్ నిర్మిస్తున్నారు. చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. మహా శివరాత్రి కానుకగా మార్చి 8 న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నారు. ఈ సందర్భంగా శనివారం కొత్త పోస్టర్ను విడుదల చేశారు.
దర్శకుడు చిత్ర విశేషాలు తెలియజేస్తూ ‘మాస్, యాక్షన్ ఎంటర్టైనర్ ఇది. పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో గోపీచంద్ పర్ఫార్మెన్స్ మరో స్థాయిలో ఉంటుంది. యాక్షన్ ఘట్టాలు ప్రధానాకర్షణగా నిలుస్తాయి. అత్యుత్తమ సాంకేతిక విలువలతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: స్వామి జె గౌడ, సంగీతం: రవి బస్రూర్, సంభాషణలు: అజ్జు మహంకాళి, దర్శకత్వం: ఏ. హర్ష.