గోపీచంద్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘భీమా’. ఏ.హర్ష దర్శకత్వంలో శ్రీసత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కేకే రాధామోహన్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా తాజా షెడ్యూల్ ఆదివారం నుంచి మంగళూరులో మొదలైంది. హీరో గోపీచంద్తో పాటు ఇతర ముఖ్య తారాగణం పాల్గొంటున్నారు. మంగళూరులోని దట్టమైన అడవిలో ఓ పాటతో పాటు యాక్షన్ ఘట్టాలను తెరకెక్కించబోతున్నారు.
దర్శకుడు చిత్ర విశేషాలు తెలియజేస్తూ ‘మాస్, యాక్షన్ ఎంటర్టైనర్ ఇది. ఫ్యామిలీ ఆడియెన్స్ను మెప్పించే అన్ని అంశాలుంటాయి. అత్యున్నత సాంకేతిక విలువలతో తెరకెక్కిస్తున్నాం. గోపీచంద్ పాత్ర గత చిత్రాలకు పూర్తి భిన్నంగా ఉంటుంది’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: స్వామి జె గౌడ, సంగీతం: రవి బస్రూర్, సంభాషణలు: అజ్జు మహంకాళి, దర్శకత్వం: ఏ. హర్ష.