Rahul Ramakrishna | టాలీవుడ్ నటుడు రాహుల్ రామకృష్ణ ఇటీవల తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై విమర్శలు గుప్పిస్తూ.. కేసీఆర్, కేటీఆర్ మళ్లీ అధికారంలోకి రావాలని ఒక ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. దీంతో ఈ విషయంపై రాహుల్ను విమర్శిస్తూ.. కాంగ్రెస్ నాయకులు అతడిపై విమర్శలు గుప్పించడంతో పాటు బెదిరింపు కాల్స్ చేశారు. దీంతో భయపడిన రాహుల్.. ఎక్స్కి డీ యాక్టివేట్ చేసి సోషల్ మీడియాకు దూరంగా గడిపాడు. అయితే తాజాగా ఈ వివాదంపై మరోసారి స్పందిస్తూ.. రాహుల్ ఎక్స్ వేదికగా ఒక పోస్ట్ పెట్టాడు. ఈ పోస్ట్లో ఇకపై ట్విట్టర్ యాక్టివిజం నుంచి పూర్తిగా వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. తన భవిష్యత్తు దృష్టి కేవలం సినిమాలపైనే ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.
”నాకంటే గొప్ప మేధావులు ఎప్పటి నుంచో సామాజిక సమస్యలతో పోరాడుతున్నారు. పాలన, పరిపాలన గురించి నాకు ఏం తెలుసు? నేను కేవలం ఒక చిన్న నటుడిని మాత్రమే. రాజకీయ వర్గాల నుంచి అనుభవం ఉన్న నాయకులతో సుదీర్ఘంగా మాట్లాడిన తర్వాత, నా ఆవేదన, నా నిరాశ తప్పుదారి పట్టిందని నేను గ్రహించాను అని రాహుల్ పేర్కొన్నారు. అలాగే వ్యవస్థను ఎవరు నడుపుతున్నా, ఎలా నడుపుతున్నా… మన రాష్ట్రానికి, ప్రజలకు నేను కేవలం మంచి జరగాలని కోరుకుంటున్నాను. కేవలం విమర్శలకే పరిమితం కాకుండా, వ్యవస్థలో భాగస్వామిగా ఉండటం నా బాధ్యత అని రాహుల్ నొక్కి చెప్పారు. భవిష్యత్తులో దేశాన్ని పట్టి పీడిస్తున్న సమస్యల పరిష్కారంలో తన వంతు సహకారాన్ని పూర్తిగా అందించే సమయం వచ్చేంత వరకు, తాను ట్విట్టర్ యాక్టివిజం నుంచి తప్పుకుంటున్నట్లు తెలిపారు. ఇకపై నా నుంచి కేవలం తెరపై అత్యుత్తమ ప్రదర్శనను మాత్రమే ఆశించండి అని పేర్కొంటూ రాహుల్ రామకృష్ణ తన ప్రకటనకు ముగింపు పలికారు. చివర్లో “జై తెలంగాణ, జై హింద్” అని రాసుకొచ్చారు.
రాహుల్ రామకృష్ణ తీసుకున్న ఈ అనూహ్య నిర్ణయం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ నాయకులే రాహుల్ని బెదిరించి ఇలా చేయించారని కామెంట్లు పెడుతున్నారు.
Greater minds than mine have long grappled with social problems. What do I know about governance and administration? I’m just a small actor.
After several long phone calls with seasoned leaders from the entire political spectrum, I have come to realise that my angst and my…— Rahul Ramakrishna (@eyrahul) October 4, 2025