Ram Charan | గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మంగళవారం ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో సందడి చేశారు. ఇటీవల ఆయన రోల్స్ రాయిస్ కారును కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. కొత్త కారు రిజిస్ట్రేషన్ కోసం ఆయన ఆర్టీసీ కార్యాలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆర్టీఏ కార్యాలయం సందడిగా మారింది. రామ్ చరణను చూసేందుకు జనాలు పోటీపడ్డారు. సిబ్బంది ఆయనతో ఫొటోలు దిగేందుకు ఉత్సాహం చూపించారు. కార్యాలయానికి వచ్చిన గ్లోబల్ స్టార్కు అధికారులు స్వాగతం పలికారు. అనంతరం కారు రిజిస్ట్రేషన్ కార్యక్రమం పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా అధికారులు ఆయనతో ఫొటోలు దిగారు. రామ్ చరణ్ వద్ద ఇప్పటికే ఎన్నో లగ్జరీ కార్లు ఉన్నారు.
తాజాగా గ్యారేజ్లోకి రోల్స్ రాయిస్ కారు చేసింది. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి వద్ద వైట్ కలర్ రోల్స్ రాయిస్ ఉన్నది. తాజాగా రామ్ చరణ్ కూడా రోల్స్ రాయిస్ కారును కొనుగోలు చేశాడు. ఈ లగ్జరీ కారు ధర రూ.7.5 కోట్లు ఉంటుందని తెలుస్తున్నది. వాస్తవానికి రోల్స్ రాయిస్ కంపెనీ కోట్లు ఉన్నా కొనుగోలు చేసేందుకు వచ్చిన అందరికీ అమ్మదు. కారును బుక్ చేసుకునే కస్టమర్ ప్రొఫైల్, సమాజంలో ఆయనకు ఉండే స్థాయి.. వివరాలు ఇలా అన్నీ పరిగణలోకి తీసుకొని మాత్రమే విక్రయిస్తుంది. ప్రస్తుతం భారతదేశంలో అతితక్కువ మంది దగ్గర మాత్రమే ఉన్నది. తాజాగా ఈ లిస్ట్లో రామ్చరణ్ సైతం చేశాడు. ఈ కారు 4.5 సెకన్ల సమయంలోనే సున్నా నుంచి వంద కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుందని తెలుస్తున్నది.
Global Star Ram Charan Tej at Khairathabad RTA Office..#RamCharan #GameChanger pic.twitter.com/XeFj6HYdtQ
— News Wala Filmy (@NewsWalaFilmy) October 22, 2024