‘ఒకే తరహా సినిమాలకు పరిమితం కాకుండా, అన్ని రకాల సినిమాలు చేసి నటిగా మంచి గుర్తింపు సాధించాలనేది నా లక్ష్యం’ అంటోంది కథానాయిక గీతికా తివారి. ఆమె తెలుగులో నటిస్తున్న తొలిచిత్రం ‘అహింస’. దర్శకుడు తేజ రూపొందిస్తున్న ఈ చిత్రం ద్వారా ప్రముఖ నిర్మాత సురేష్బాబు తనయుడు అభిరామ్ హీరోగా పరిచయమవుతున్నాడు. జూన్ 2న ఈ చిత్రం విడుదలకానుంది. ఈ సందర్భంగా హీరోయిన్ గీతికా తివారి మాట్లాడుతూ ‘మాది మధ్యప్రదేశ్లోని జబల్పూర్.
నాకు టాలీవుడ్ సినిమాలు అంటే చాలా ఇష్టం. దర్శకుడు తేజ అడిషన్స్ చేసి నన్ను సెలెక్ట్ చేశారు. తేజది లక్కీ హ్యాండ్. ఆయన సినిమా ద్వారా లాంచ్ కావడం అదృష్టంగా భావిస్తున్నాను. ఈ చిత్రంలో నా పాత్ర పేరు అహల్య. అమాయకత్వం నుంచి స్ట్రాంగ్ అండ్ పవర్ఫుల్గా ఎదిగిన పాత్ర. తనకి ప్రేమపై నమ్మకం వుంటుంది. కుటుంబం, కల్చర్, నేచర్తో ఈ సినిమా కనెక్ట్ అయి వుంటుంది. అహింస, ఫ్యామిలీ ఓరియెంటెడ్ ఫిల్మ్. తప్పకుండా తెలుగులో ఈ చిత్రం ద్వారా మంచి కథానాయికగా పేరు వస్తుందనే నమ్మకం వుంది’ అని చెప్పింది.