Geeta Govindam | టాలీవుడ్లో కొన్ని కాంబినేషన్స్ తెరపైకి రాబోతున్నాయంటే ఆ క్రేజే వేరు. అలాంటి క్రేజీ కాంబోల్లో ఒకటి పరశురాం (Parasuram), విజయ్ దేవరకొండ (Vijay Deverakonda). ఈ ఇద్దరూ గీతగోవిందం (Geeta Govindam) సినిమాతో బాక్సాఫీస్ను షేక్ చేశారు. పరశురాం ఓ సింపుల్ కథతో మ్యాజిక్ చేసి బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్లకు పైగా వసూళ్లు చేసి.. నిర్మాతలకు కాసుల వర్షం కురిపించాడు. ఈ చిత్రం విజయ్ దేవరకొండను ఫ్యామిలీ ఆడియెన్స్ కు దగ్గర చేయడమే కాకుండా కన్నడ భామ రష్మిక మందన్నాకు సూపర్ హిట్ ఇచ్చింది.
కాగా విజయ్-పరశురాం మరో సినిమా చేయబోతున్నారని ఇప్పటికే నెట్టింట వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. చాలా రోజుల తర్వాత దీనికి సంబంధించిన అప్డేట్ బయటకు వచ్చింది. ఈ ఇద్దరితో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై దిల్ రాజు సినిమాకు ప్లాన్ చేసినట్టు సమాచారం. అంతేకాదు తాజా టాక్ ప్రకారం రేపు ఉదయం 9:30 గంటలకు ఈ మూవీని లాంఛ్ చేయబోతున్నారట.
ఆసక్తికర విషయమేంటంటే ఈ చిత్రాన్ని సింగిల్ షెడ్యూల్లో పూర్తి చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు ఇన్సైడ్ టాక్. సీతారామం ఫేం మృణాళ్ ఠాకూర్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. ఫీ మేల్ లీడ్ రోల్లో పూజా హెగ్డే కన్ఫామ్ అయిందని వార్తలు రాగా.. ఆమె స్థానంలో మృణాళ్ ఠాకూర్ను రీప్లేస్ చేసినట్టు టాక్.
విజయ్ దేవరకొండ ప్రస్తుతం ఖుషీ సినిమాతో బిజీగా ఉన్నాడు. రొమాంటిక్ ఎంటర్టైనర్గా రాబోతున్న ఈ చిత్రంలో సమంత హీరోయిన్గా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. లైగర్ సినిమా ఫ్లాప్ తర్వాత పూరీ జగన్నాథ్తో చేయనున్న జేజీఎం (జనగణమన) సస్పెన్స్లో పడ్డది.