విష్ణు విశాల్, ఐశ్వర్య లక్ష్మి జంటగా నటిస్తున్న సినిమా ‘మట్టి కుస్తీ’. స్పోర్ట్స్ డ్రామా కథతో దర్శకుడు చెల్లా అయ్యావు రూపొందిస్తున్నారు. రవితేజ, విష్ణు విశాల్ నిర్మాతలు. ఈ చిత్రాన్ని డిసెంబర్ 2న విడుదల చేస్తున్నట్లు తాజాగా చిత్ర బృందం ప్రకటించారు. ఈ సందర్భంగా ఓ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ సినిమాలో స్టార్ రెజ్లర్గా విష్ణు విశాల్ నటిస్తున్నారు. బరిలో మల్లయోధుడు చేసే పోరాటాలు ఆసక్తి కలిగిస్తాయని ఫిల్మ్ యూనిట్ చెబుతున్నారు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు తుది దశలో ఉన్నాయి. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ : రిచర్డ్ ఎం నాథన్, సంగీతం : జస్టిన్ ప్రభాకరన్.