‘ఇదొక యూనిక్ స్టోరీ. హీరో లూజర్ నుంచి విన్నర్గా ఎలా మారాడు అనేది ఇందులో అసక్తికరమైన అంశం’ అన్నారు యువహీరో గీతానంద్. ఆయన హీరోగా దయానంద్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘గేమ్ ఆన్’. రవి కస్తూరి నిర్మాత. నేడు ఈ సినిమా విడుదల కానుంది.
ఈ సందర్భంగా గీతానంద్ విలేకరులతో ముచ్చటించారు. ‘ఈ చిత్ర దర్శకుడు దయానంద్ నా తమ్ముడే. ఇద్దరం కలిసి చాలా షార్ట్ ఫిల్మ్స్ చేశాం. తమ్ముడు కథ రాస్తే నేను నటించేవాడ్ని. లేదంటే వాడి కథను నేను డైరెక్ట్ చేసేవాడ్ని. ఆ అనుభవం ఈ సినిమా విషయంలో బాగా ఉపయోగపడింది.
స్క్రిప్ట్ విషయంలో బాగా డిస్కస్ చేసుకునేవాళ్లం. రియల్టైం సైకలాజికల్గా సాగే ఈ సినిమాతో ప్రేక్షకులు గేమ్ వరల్డ్లోకి వెళ్లిపోతారు. యాక్షన్ సీక్వెన్సెస్ కూడా చాలా కొత్తగా ఉంటాయి. ఇందులోని బ్యాక్స్టోరీ ఎవరూ ఊహించలేరు అనేంతగా ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ హైలైట్. విజువల్స్ కొత్తగా ఉంటాయి. సాంకేతికంగా నెక్ట్స్ లెవల్లో ఉంటుందీ సినిమా. ప్రీమియర్ షోస్ చూసినవాళ్లంతా అద్భుతం అంటున్నారు. ఈ సినిమాకు వచ్చే స్పందనను బట్టి సీక్వెల్ ప్రకటిస్తాం’ అని చెప్పారు గీతానంద్.