రామ్చరణ్ కథానాయకుడిగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం ‘గేమ్ ఛేంజర్’. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ జరుగుతున్నది. ‘ఆర్ఆర్ఆర్’ వంటి బ్లాక్బస్టర్ హిట్ తర్వాత రామ్చరణ్ నటిస్తున్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలేర్పడ్డాయి. దసరా పర్వదినాన్ని పురస్కరించుకొని ఈ సినిమా తాలూకు కొత్త పోస్టర్ను విడుదల చేశారు.
దీపావళి సందర్భంగా చిత్రంలోని తొలి గీతాన్ని విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఓ సాధారణ యువకుడు అసాధారణ నాయకుడిగా ఎదిగిన వైనాని ఆవిష్కరిస్తూ చక్కటి సామాజిక సందేశంతో దర్శకుడు శంకర్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారని తెలిసింది. పాటల కోసమే దాదాపు వందకోట్లు ఖర్చు పెట్టినట్లు సమాచారం. కియారా అద్వాణీ, అంజలి, సముద్రఖని, ఎస్.జె.సూర్య, శ్రీకాంత్, సునీల్, నవీన్చంద్ర తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: ఎస్.తిరుణావుక్కరసు, సంగీతం: తమన్, సంభాషణలు: సాయిమాధవ్ బుర్రా, నిర్మాతలు: దిల్రాజు-శిరీష్, దర్శకత్వం: శంకర్.