Ram Charan | మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదరుచూస్తున్న సినిమా ‘గేమ్ఛేంజర్’. రెండేళ్ల క్రితం ప్రారంభమైన ఈ సినిమా ఇంకా నిర్మాణంలోనే ఉండటం అభిమానుల్లో అసహనానికి దారితీస్తూ వుంది. కమల్హాసన్తో శంకర్ తెరకెక్కిస్తున్న ‘భారతీయుడు -2’ చిత్రమే ‘గేమ్ఛేంజర్’ ఆలస్యానికి కారణమని ఫిలింవర్గాల టాక్. అయితే ఎట్టకేలకు చరణ్ ‘గేమ్ఛేంజర్’ విషయంలో ఓ క్లారిటీ వచ్చింది. ఇటీవలే బెంగళూరులో 15రోజుల పాటు జరిగిన షెడ్యూల్తో ఈ సినిమా షూటింగ్ 80శాతం పూర్తయిందని నిర్మాత దిల్ రాజు తెలియజేశారు.
మిగతా షూటింగ్ కూడా పూర్తి చేసిన తర్వాత విడుదల తేదీని ప్రకటిస్తామని ఆయన అన్నారు. రామ్చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ చిత్రం సమకాలీన రాజకీయ ముఖచిత్రానికి అద్దం పట్టేలా ఉంటుందని తెలుస్తున్నది. కైరా అద్వాణీ, అంజలి కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రంలో శ్రీకాంత్, ఎస్.జె.సూర్య, సునీల్ ప్రత్యేక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: తమన్.