అర్జున్ కథానాయకుడిగా శంకర్ దర్శకత్వంలో 1993లో వచ్చిన ‘జెంటిల్మెన్’ చిత్రం కమర్షియల్గా పెద్ద విజయాన్ని అందుకున్నది. దాదాపు ఇరవై తొమ్మిదేళ్ల తర్వాత ఈ సినిమాకు సీక్వెల్ రాబోతున్నది. ‘జెంటిల్మెన్-2’ పేరుతో నిర్మాత కె.టి. కుంజుమన్ ఈ సినిమాను నిర్మించబోతున్నారు. ఈ సీక్వెల్కు ఎం.ఎం. కీరవాణి సంగీతాన్ని అందించబోతున్నారు. “జెంటిల్మెన్-2’చిత్రానికి కీరవాణి సంగీతాన్ని అందించబోతున్నారని గర్వంగా ప్రకటిస్తున్నా’అని నిర్మాత కుంజుమన్ చెప్పారు. త్వరలో ఈ సినిమాకు సంబంధించిన ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాల్ని వెల్లడిస్తామని ఆయన తెలిపారు.