యువతకు ఉపాధి కల్పించే దిశగా ప్రభుత్వం
ఎస్సీ సంక్షేమ శాఖ ద్వారా 21 పథకాలతో చేయూత
రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్
పైలట్ ప్రాజెక్టు కింద దొంగతుర్తిలో 32 మందికి రూ.1.28 కోట్ల విలువైన బర్రెల పంపిణీ
ధర్మారం, మార్చి31: ఎస్సీలు సాగుతో పాటు పాడిపై దృష్టిపెట్టి ఆర్థికాభివృద్ధి సాధించాలని రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ పిలుపునిచ్చారు. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు కేసీఆర్ ప్రభుత్వం పక్కా ప్రణాళికతో ముందు కెళ్తున్నదని చెప్పారు. ఎస్సీ సంక్షేమ శాఖ ద్వారా 21 పథకాల కింద చేయూతనిస్తున్నదని చెప్పారు. బుధవారం మల్లాపూర్లో రూ.7.50లక్షలతో నిర్మించిన ఎస్సీ కమ్యూనిటీ భవనానికి శంకుస్థాపన చేశారు. అనంతరం మల్లాపూర్ ఎక్స్రోడ్డులో ఆలిండియా బంజారా సేవాసమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు నున్సావత్ భాస్కర్ నాయక్ ఏర్పాటు చేసిన పెట్రోల్ బంక్ను చొప్పదండి ఎమ్మెల్యే రవిశంకర్తో కలిసి ప్రారంభించారు. తదనంతరం ధర్మారంలో డీఎంఎఫ్టీ నిధులు రూ.4.60లక్షలతో నిర్మించిన స్వర్ణకారుల కుల సంఘ భవనానికి శంకుస్థాపన చేశారు. దొంగతుర్తిలో 8 గ్రామాలకు చెందిన 32 మంది ఎస్సీ లబ్ధిదారులకు రూ.1.28 కోట్ల విలువైన పాడి గేదెలను పంపిణీ చేశారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడారు. ధర్మారం మండలాన్ని పైలెట్ ప్రాజెక్ట్ కింద ఎంపిక చేసి కార్పొరేషన్ ద్వారా పాడి గేదెలను పంపిణీ చేయాలని సంకల్పించామన్నారు. మేలు రకం ముర్రాజాతి గేదెలను అందించాలనే ఉద్దేశంతో స్వయంగా హర్యానా రాష్ర్టానికి వెళ్లి ఎంపిక చేశామన్నారు. ఒక్కొక్కరికీ 4 గేదెలు పంపిణీ చేయాలని నిర్ణయించి తొలి విడుత 2 చొప్పున 60 శాతం సబ్సిడీపై అందజేశామని చెప్పారు. పాల విక్రయానికి కరీంనగర్ డెయిరీ వారు సహకరిస్తారని చెప్పారు. గేదెలకు సరిపడా దాణా సమకూర్చామన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో జయశీల, జడ్పీటీసీ పూస్కూరు పద్మజ, పెద్దపల్లి డీసీపీ రవీందర్, ప్యాక్స్ చైర్మన్లు ముత్యాల బలరాంరెడ్డి, నోముల వెంకటరెడ్డి, వైస్ చైర్మన్ సామంతుల రాజమల్లు, ఏఎంసీ చైర్మన్ గుర్రం మోహన్రెడ్డి, వైస్ చైర్మన్ గూడూరి లక్ష్మణ్, వైస్ ఎంపీపీ మేడవేని తిరుపతి, సర్పంచులు పాలకుర్తి సత్తయ్య, గంధం వరలక్ష్మీ, పూస్కూరు జితేందర్రావు, ఎంపీటీసీలు తుమ్మల రాంబాబు, దాడి సదయ్య, ఉప సర్పంచులు శ్రీనివాస్, లత, చంద్రశేఖర్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పీ రాజేశం, మండల కోఆప్షన్ సభ్యుడు ఎండీ రఫీ, ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడు మిట్ట తిరుపతి, ఆర్బీఎస్ మండల సభ్యుడు పాక వెంకటేశం, పార్టీ ధర్మారం, మల్లాపూర్ అధ్యక్షులు బాస తిరుపతిరావు, గుమ్మడి శ్రీనివాస్, నేతలు నారాయణ, హఫీజ్, రవీందర్, నర్సయ్య, కొముర య్య, బాబా ఉన్నారు. కాగా కరోనా బారిన పడి కోలుకున్న ధర్మారానికి చెందిన ఆర్బీ ఎస్ జిల్లా సభ్యుడు పూస్కూరు రామా రావును మంత్రి పరామర్శించారు.
సారూ..మీ సాయం మరువలేను..
మంత్రి సారూ.. మీ సాయం మరువలేం అంటూ సీఎం సహాయనిధి లబ్ధిదారుడు రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్కు కృతజ్ఞతలు తెలిపారు. వివరాలు.. దొంగతుర్తికి చెందిన తమ్మడవేని అంజయ్యను 2019 ఫిబ్రవరి 27న రక్తపింజర పాము కాటు వేసింది. చికిత్సకు ప్రైవేట్ దవాఖానల్లో రూ.9.23 లక్షలు ఖర్చు చేశాడు. మంత్రి ద్వారా సీఎంఆర్ఎఫ్కు దరఖాస్తు చేసుకోగా రూ.3.40 లక్షలు మంజురయ్యాయి. చెక్కును మంత్రి మంగళవారం కరీంనగర్లోని తన క్యాంపు కార్యాలయంలో అంజయ్యకు అందజేశారు. ఈ క్రమంలో బుధవారం దొంగతుర్తికి వచ్చిన మంత్రిని అంజయ్య భార్యాపిల్లలను వెంటబెట్టుకొని కలిశారు. సత్కరించి సాయం చేసిన అమాత్యుడికి కృతజ్ఞతలు తెలిపారు.