Major | టాలీవుడ్ (Tollywood) యంగ్ హీరో అడివి శేష్ (Adivi Sesh) కెరీర్లో వన్ ఆఫ్ ది మైల్ స్టోన్ సినిమాగా నిలిచిన చిత్రం మేజర్ (Major). 26/11 ముంబై ఉగ్ర దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన మేజర్ సందీప్ ఉన్నిక్రిష్ణన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రానికి శశి కిరణ్ టిక్కా దర్శకత్వం వహించాడు. మేజర్లో బాలీవుడ్ హీరోయిన్ సయీ మంజ్రేకర్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటించింది. కరోనా ప్రభావంతో ఎప్పుడో ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ చిత్రం ఫైనల్గా గతేడాది మే 24న థియేటర్లలో గ్రాండ్గా విడుదలైంది.
మేజర్ ఆ తర్వాత డిజిటల్ ప్లాట్ఫాంలో కూడా మంచి టాక్ తెచ్చుకుంది. సినిమాను మిస్సయిన వారి కోసం వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ డేట్ వచ్చేసింది. మేజర్ మే 14న సాయంత్రం 6 గంటలకు జెమినీ టీవీలో ప్రీమియర్ కానుంది. థియేటర్లలో, ఓటీటీ ప్లాట్ఫాంలో సినిమా చూసే అవకాశం లేని వాళ్లు ఇక కుటుంబ సమేతంగా చూసేందుకు రెడీగా ఉండండి మరి. పాన్ ఇండియా కథాంశంతో తెలుగు, హిందీతోపాటు పలు భాషల్లో విడుదలైన ఈ చిత్రానికి బాక్సాఫీస్ వద్ద విమర్శకుల ప్రశంసలు దక్కాయి.
ఈ చిత్రానికి టాలీవుడ్ హీరో మహేశ్బాబు(Mahesh Babu) వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్గా వ్యహరించాడని తెలిసిందే. జీఎంబీ ఎంటర్టైన్మెంట్, సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, ఏ+ఎస్ మూవీస్ సంయుక్త నిర్మాణంలో తెరకెక్కించారు. అడివి శేష్ స్క్రీన్ ప్లే అందించడం విశేషం. శ్రీచరణ్ పాకాల సంగీతం అందించాడు. ఈ మూవీలో శోభితా ధూళిపాళ, ప్రకాశ్ రాజ్, మురళీ శర్మ, రేవతి, అనీష్ కురువిల్ల ఇతర కీలక పాత్రల్లో నటించారు.