తెలుగు నిర్మాతల మండలిలో విభేదాలు తలెత్తాయి. సకాలంలో ఎన్నికలు నిర్వహించాలని కోరు తూ శనివారం హైదరాబాద్ ఫిలించాంబర్లోని నిర్మాతల మండలి కార్యాలయం ముందు కొందరు నిర్మాతలు ధర్నా చేపట్టారు. సమయం ముగిసినా ఎన్నికలు నిర్వహించడం లేదం టూ వారు ప్లకార్డులు ప్రదర్శించారు. ఈ ధర్నాలో నిర్మాతలు యలమంచిలి రవిచంద్, మోహ న్ గౌడ్, విజయ్ వర్మ తదితరులు పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ..‘నిర్మాతల మండలి కమిటీ సభ్యుల సంక్షేమం మరిచింది. నాలుగేళ్లుగా ఆదాయ వ్యయాల లెక్కలు చెప్పడం లేదు. సర్వసభ్య సమావేశంలో అడిగినా సమాధానం లేదు అన్నారు.