హైదరాబాద్: టాలీవుడ్లో మరో విషాదం చోటుచేసుకున్నది. ఎడిటర్ గౌతమ్రాజు మరణాన్ని మరచిపోకముందే ప్రముఖు నిర్మాత గోరంట్ల రాజేంద్రప్రసాద్ కన్నుమశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో ఇబ్బందిపడుతున్న ఆయన గురువారం ఉదయం తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. రాజేంద్రప్రసాద్ మృతిపట్ల టాలీవుడ్ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు.
గోరంట్ల రాజేంద్ర ప్రసాద్ 1963 లో రాముడు భీముడు చిత్రం భాగస్వామిగా సినిమా రంగంలోకి అడుగు పెట్టారు. అగ్ర నిర్మాత డీ రామానాయుడుతో కలిసి ప్రతిజ్ఞా పాలన, శ్రీకృష్ణ తులాభారం, స్త్రీ జన్మ, జీవన తరంగాలు చిత్రాలను నిర్మించారు. అనంతరం సొంతంగా మాధవి పిక్చర్స్ బ్యానర్ను నెలకొల్పారు. అక్కినేని హీరోగా బందిపోటు దొంగలు, సుపుత్రుడు, దొరబాబు, చిత్రాలను నిర్మించారు.