చండీఘడ్: తన కారుపై రైతులు దాడి చేసినట్లు బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ఆరోపించింది. హిమాచల్ ప్రదేశ్ నుంచి పంజాబ్లోకి ఎంటరైన సమయంలో.. బుంగా సాహిబ్ వద్ద తన కారును రైతులు అడ్డుకున్నట్లు ఆమె వెల్లడించింది. నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ధర్నా చేస్తున్న సమయంలో.. నటి కంగనా వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ వ్యాఖ్యల పట్ల క్షమాపణలు చెప్పాలని రైతులు డిమాండ్ చేశారు. పంజాబ్లోకి ఎంటర్ కాగానే తన కారుపై ఓ గుంపు దాడి చేసిందని, రైతులమని వాళ్లు చెప్పుకున్నారని ఇన్స్టాగ్రామ్లో కంగనా చెప్పింది. తన సోదరి పుట్టిన రోజును సెలబ్రేట్ చేసుకునేందుకు మనాలి నుంచి కంగనా పంజాబ్కు వెళ్లింది.