ప్రముఖ నేపథ్య గాయని చిత్ర ఆలపించిన ‘శ్రీరాముడా.. కృష్ణుడా.. ఈశ్వరుడా’ అనే పాట రికార్డింగ్తో నూతన చిత్రం ‘ఊహకు అందనిది’ ప్రారంభమైంది. ఎం.నాగేంద్ర ఈ చిత్రానికి దర్శకుడు. దర్శకుడు మాట్లాడుతూ ‘భారీ బడ్జెట్తో, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఈ చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నాం.
సస్సెన్స్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్తో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని హైదరాబాద్, చెన్నైలో చిత్రీకరిస్తాం. ఏప్రిల్లో షూటింగ్ను మొదలుపెట్టి డిసెంబర్లో పూర్తిచేస్తాం’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: మహావీర్.