Actress Shobhita | సినిమా ఇండస్ట్రీలో విషాదకర ఘటన చోటు చేసుకున్నది. ప్రముఖ కన్నడ బుల్లితెర నటి శోభిత ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆమె కన్నడంతో పాటు తెలుగులోనూ పలు సీరియల్స్లో నటించారు. కన్నడంలో ఏరేండ్ల తూ, ఏటీఎం, జాక్పాట్, అపార్ట్మెంట్ టు మర్డర్, వందన చిత్రాల్లో నటించింది. బ్రహ్మగతంతు, నినిదలే తదితర టీవీ సీరియల్స్లో నటించింది. ప్రస్తుతం తెలుగులోనూ పలు సీరియల్స్ చేస్తున్నది. శోభిత గతేడాది ఆత్మహత్య చేసుకున్నది. రెండేళ్ల కిందట పెళ్లి చేసుకొని స్థిరపడింది. ఆదివారం గచ్చిబౌలిలోని తన నివాసంలో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. అయితే, ఆత్మహత్యకు కారణాలు తెలియరాలేదు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
శోభిత స్వస్థలం కర్ణాటక హాసన్లోని సకలేశ్పూర్. స్థానికంగానే గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి బెంగళూరుకు చేరింది. శోభిత 12పైగా కన్నడ సీరియల్స్లో పనిచేసింది. చిదపాట, మంగళగౌరి, కోగిలే, బ్రహ్మగంతు, కృష్ణ రుక్మిణి, మణెదేవ తదితర సీరియల్స్లో నటించింది. అలాగే, కన్నడ సినిమాలో రెండు మూడు సినిమాల్లో చందన్, శ్వేతా పండిత్లతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంది. సినిమాలు, టీవీరంగంపై మక్కువ పెంచుకొని విద్యార్థి దశ నుంచే డ్యాన్స్పై మక్కు పెంచుకుంది. మొదట యాంకర్గా పని చేశారు. ఆ తర్వాత బుల్లితెరలో అదృష్టం పరీక్షించుకుంది. అక్కడి నుంచి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. నటి శోభిత సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటుంది. ఎప్పటికప్పుడు అభిమానులకు టచ్లో ఉంటుంది. ఏడాది కిందట పెళ్లి చేసుకోగా.. ఆమె భర్త హైదరాబాద్లోని ఓ కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. పెళ్లయిన తర్వాత సినిమాలు, టీవీకి దూరమైంది. సోషల్ మీడియాలో చివరిసారిగా కన్నడ రాజ్యోత్సవం, దీపావళి సందర్భంగా అభిమానులకు శుభాకాంక్షలు తెలిపింది. ఆత్మహత్యపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం బెంగళూరుకు పార్థీవ దేహాన్ని తరలించనున్నట్లు సమాచారం.