Akshay Kumar | బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ (Akshay Kumar) మళ్లీ పాన్ మసాలా యాడ్ (Pan Masala Advertisement)లో నటిస్తున్నారంటూ గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఆయన పాన్ మసాలా యాడ్లో నటించిన వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. దీంతో అక్షయ్ మరోసారి విమల్ పాన్ మసాలా (Vimal Pan Masala)కు బ్రాండ్ అంబాసిడర్గా మారారంటూ పలు వెబ్సైట్లలో కథనాలు వెలువడ్డాయి. కాగా, ఈ వార్తలపై అక్షయ్ తాజాగా స్పందించారు. ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశారు. ఆ వీడియో గతంలో చిత్రీకరించిందని క్లారిటీ ఇచ్చారు.
‘నేను మళ్లీ పాన్ మసాలా యాడ్లో నటిస్తున్నట్లు వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు. ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోన్న ప్రకటన 2021 అక్టోబర్ 13న చిత్రీకరించినది. అగ్రిమెంట్ ప్రకారం దీనిని 2023 నవంబర్ వరకు ప్రసారం చేయవచ్చు. అంతేకానీ, ఇది ఇప్పుడు చిత్రీకరించిందికాదు. ఇలాంటి ప్రకటనల్లో నటించనని నేను బహిరంగంగానే వెల్లడించాను. ఆ ప్రకటన తర్వాత నేను మళ్లీ అలాంటి యాడ్స్లో పాల్గొనలేదు. దయచేసి తప్పుడు వార్తలను ప్రచారం చేయొద్దు’ అంటూ వివరణ ఇచ్చారు.
‘Returns’ as ambassador? Here’s some fact check for you Bollywood Hungama, if by chance you are interested in things other than fake news. These ads were shot on 13th October, 2021. I have not had anything to do with the brand ever since I publicly announced the discontinuation…
— Akshay Kumar (@akshaykumar) October 9, 2023
Also Read..
Israel-Hamas War | రాత్రికి రాత్రే గాజాలో 200 మిలిటెంట్ స్థావరాలపై దాడిచేసిన ఇజ్రాయెల్ సైన్యం
Israel-Hamas War | హమాస్ మిలిటెంట్లను ఏరిపారేస్తున్న ఇజ్రాయెల్ పోలీసులు.. వీడియో