చార్మినార్ ఏరియాలో వెంకటేష్, వరుణ్తేజ్ సందడిచేస్తున్నారు. వారు హీరోలుగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఎఫ్-3’. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. డబ్బు వల్ల వచ్చే సమస్యల్ని వినోదాత్మకంగా ఈ సినిమాలో ఆవిష్కరించబోతున్నారు. ప్రస్తుతం హైదరాబాద్లో ఈ సినిమా చిత్రీకరణ జరుగుతున్నది. చార్మినార్ పరిసర ప్రాంతాల్లో వెంకటేష్, వరుణ్తేజ్లపై ఓ గీతాన్ని చిత్రీకరిస్తున్నారు. సూఫీ ైస్టెల్లో విభిన్నంగా ఈ పాట సాగనున్నట్లు సమాచారం. ‘ఎఫ్-2’కు సీక్వెల్గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో తమన్నా, మెహరీన్ కథానాయికలుగా నటిస్తున్నారు. దిల్రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్నది.