మేజర్ సినిమాతో హిట్ కొట్టిన కథానాయకుడు అడవి శేష్ మంచి జోరుమీదున్నాడు.. ఆయన తాజాగా నటించిన హిట్-2 చిత్రం రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. శైలేష్ కొలను దర్శకత్వంలో కథానాయకుడు నాని ఈ చిత్రాన్ని నిర్మించిన సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రానికి అనూహ్యంగా అన్ని చోట్ల మంచి బజ్తో పాటు అడ్వాన్స్ బుకింగ్స్ కూడా అందరూ ఆశ్చర్యపడే విధంగా ఫాస్ట్గా వున్నాయి.
రేపు ఈ చిత్రం మొదటిషోకు ఐమ్యాక్స్లోని బిగ్స్క్రీన్స్తో సహా ఆరు స్క్రీన్స్లో ఈ చిత్రమే ప్రదర్శిస్తున్నారు. మార్నింగ్ ఆటలతో పాటు అన్ని షోస్ కూడా హౌస్ఫుల్స్ అవ్వడం ట్రేడ్వర్గాలను విస్మయపరుస్తుంది. అంతేకాదు ఓవర్సీస్లో కూడా అడ్వాన్స్ బుకింగ్స్ అడవిశేష్ కెరీర్లోనే దిబెస్ట్గా నిలిచే విధంగా వున్నాయట.
ఈ చిత్రం తొలిరోజు నాలుగు కోట్ల వరకు షేర్ను రాబట్టుకుంటుదని అంటున్నాయి ట్రేడ్వర్గాలు. క్రైమ్ థ్రిల్లర్గా రూపొందిన ఈ చిత్రంలో కొత్తదనంతో పాటు కథాగమనంలో మంచి సస్పెన్స్ వుంటుందని చెబుతుంది చిత్రబృందం. ఈ సినిమాకు కొనసాగింపుగా మరిన్ని భాగాలు రాబోతున్నాయట.
చివరి భాగాన్ని అవెంజర్స్ తరహాలో తెరకెక్కించాలనేది దర్శకుడి ఆలోచన అని తెలిసింది. మేజర్ చిత్రంతో పాన్ఇండియా హీరోగా గుర్తింపు రావడంతో హిట్-2 చిత్రాన్ని కూడా త్వరలోనే ఇతర భాషల్లో డబ్బింగ్ చేసి విడుదల చేయాలనే ప్లాన్లో వున్నారు నిర్మాత నాని.