హనుమకొండ చౌరస్తా, ఏప్రిల్ 26 : మే 6న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ‘జయమ్మ పంచాయితీ’ చిత్రాన్ని అందరూ వీక్షించి ఆదరించాలని సినీనటి, యాంకర్ సుమ కోరారు. మంగళవారం హనుమకొండ బాలసముద్రంలోని ప్రెస్క్లబ్లో ఆమె సినిమా వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా సుమ మాట్లాడుతూ..వరంగల్ భద్రకాళి అమ్మవారిని దర్శించుకుని, వారి ఆశీస్సులతో సినిమా ప్రచారం ఇక్కడినుంచే స్టార్ట్ చేశాం.
ఒక పల్లెటూరులోని ప్రతి ఇంట్లో జరిగే పంచాయితీలను శ్రీకాకుళం యాసలో జయమ్మగా పరిష్కరిస్తా. ప్రేక్షకులకు ఏం కోరుకుంటున్నారో అవన్నీ సినిమాలో ఉంటాయి. సినిమా కంటెంట్ చూసి ఆదరించాలి. సినిమాలో హీరోయిన్గా అవకాశం కల్పిస్తే చేస్తానని కానీ అక్క, ఆంటీ పాత్రల్లో నటించను. అన్నారు. ఈ సందర్భంగా శ్రీకాకుళం యాసలో సినిమాలోని ఒక డైలాగ్ చెప్పి అందరినీ నవ్వించింది సుమ. ఈ సమావేశంలో ఇతర చిత్రబృందం పాల్గొన్నారు.