నా ఇద్దరు పిల్లలు, నా భర్త, అత్తమామలు, నా తల్లి.. ఇలా ఫ్యామిలీలోని అందరికీ కరోనా సోకిందని చెప్పింది బాలీవుడ్ నటి శిల్పాశెట్టి. తనకు మాత్రం నెగటివ్గా తేలినట్లు ఆమె ట్విటర్ ద్వారా చెప్పింది. ప్రస్తుతం తన కుటుంబమంతా హోమ్ ఐసోలేషన్లో ఉన్నట్లు శిల్పా తెలిపింది. అయితే అందరూ ఈ మహమ్మారి నుంచి బాగానే కోలుకుంటున్నట్లు ఆమె చెప్పింది. ఓ కుటుంబంగా గత పది రోజులు మాకు చాలా కష్టంగా గడిచాయి. నా అత్తమామలు కొవిడ్ బారిన పడ్డారు. ఆ తర్వాత సమీషా, వియాన్ రాజ్, నా తల్లి సునంద, చివరికి రాజ్కు కూడా ఈ మహమ్మారి సోకింది. డాక్టర్ల సలహా మేరకు ఇంట్లోనే ఎవరి గదుల్లో వాళ్లు ఐసోలేషన్లో ఉన్నట్లు వివరించింది. నా టెస్టులు మాత్రం నెగటివ్గా వచ్చాయి అని శిల్ప చెప్పింది.