Esha Deol | ఇటీవల కాలంలో పలువురు సీనితారలు పెళ్లి చేసుకొని కొత్త జీవితంలోకి అడుగుపెడుతుండగా.. మరకొందరు తమ వైవాహిక జీవితానికి ముగింపు పలుకుతున్నారు. సినిమా పరిశ్రమలో నటీనటుల విడాకులు కొత్తేం కాదు. ఇటీవల సినీతారలు విడిపోయిన సంగతి తెలిసిందే. తాజాగా మరో హీరోయిన్ సైతం భర్త నుంచి విడాకులు తీసుకున్నది. ఆమె ఎవరో కాదు ప్రముఖ నటి హేమమాలిని-ధర్మేంద్రల ముద్దుల తనయ ఈషా డియోల్ సైతం తన 12 సంవత్సరాల వైవాహిక జీవితానికి ముగింపు పలికింది.
ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. ఒకరికొకరం పరస్పర అంగీకారంతోనే భరత్, తాను విడిపోయామని ఈషా.. పిల్లలకు మాత్రం తమకు చాలా ముఖ్యమని పేర్కొంది. ఉన్నట్టుండి ఒక్కసారి స్టార్కిడ్ విడాకులు ప్రకటించడంతో అభిమానులంతా షాక్కు గురయ్యారు. ప్రస్తుతం బాలీవుడ్లో ఈషా విడాకులు చర్చనీయాంశంగా మారాయి. ఈషా 20212లో భరత్ తక్తానీని వివాహమాడింది. ఆ సినిమాల్లో బిజీగా ఉండగానే పెళ్లి చేసుకొని.. యాక్టింగ్కు బ్రేక్ ఇచ్చింది.
తర్వాత ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చింది. అయితే, ఏడాది వరకు అన్యోన్యంగా ఉన్న భరత్, ఈషా.. గతేడాది వివాహ వార్షికోత్సవం సందర్భంగా భర్తతో దగ్గరగా ఉన్న ఫొటోలును షేర్ చేసింది. ఆ తర్వాత ఎప్పుడూ పిల్లలను ఫొటోలను మాత్రం షేర్ చేస్తూ వస్తుండేది. అప్పుడు ఇద్దరి మధ్య ఏమో జరిగి ఉంటుందని.. విడిపోతున్నారనే వార్తలు వచ్చాయి. తాజాగా విడిపోయినట్లు ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చింది. ఈషా డియోలో 2002లో ‘కొయి మేరో దిల్ సే పూచే’ సినిమాతో బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. దాదాపు 30 సినిమాల్లో నటించింది. అలాగే పలు వెబ్సిరీస్లలోనూ కనిపించింది.