భరత్, విషికా లక్ష్మణ్ ముఖ్యతారలుగా రూపొందుతున్న చిత్రం ‘ఏందిరా ఈ పంచాయితీ’. గంగాధర.టీ దర్శకుడు. ప్రదీప్కుమార్ నిర్మాత. ఈ చిత్రం టైటిల్ పోస్టర్ను విడుదల చేసింది చిత్రబృందం. దర్శకుడు మాట్లాడుతూ ‘సహజత్వానికి దగ్గరగా వుండే కథతో, పాత్రలతో రూపొందుతున్న రా అండ్ రస్టిక్ ఎంటర్టైనర్ ఇది.
గ్రామీణ నేపథ్యంలో రూపొందుతున్న ఈ కమర్షియల్ ఎంటర్టైనర్లో అన్ని వర్గాల వారికి నచ్చే అంశాలున్నాయి’ అన్నారు. కాశీ విశ్వనాథ్, తోటపల్లి మధు, రవివర్మ, ప్రేమ్సాగర్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: పీఆర్ (పెద్దపల్లి రోహిత్).