కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చి తెలుగులో హిట్ మీద హిట్ కొడుతూ మంచి ఫాంలో ఉంది రష్మికమందన్నా (Rashmika Mandanna). గతేగాది తమిళంలోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. ఈ బ్యూటీ ఇటీవలే నటించిన పాన్ ఇండియా ప్రాజెక్టు పుష్ప..ది రైజ్తో సక్సెస్ అందుకుంది. ఇపుడు పుష్ప 2తోపాటు పలు హిందీ ప్రాజెక్టులతో బిజీగా ఉంది. ఈ భామ ఇన్ స్టాగ్రామ్లో పాజిటివ్ వైబ్స్ (Positive vibes)తో కూడిన సందేశాన్ని పోస్ట్ పెట్టింది.
‘మీ ద్వారా, మీతో ఉండటం,మీరంతా ప్రపంచంలోని ఉత్తమమైన ప్రదేశం. మీరంతా నేను చాలా సంతోషంగా ఉండేలా చేశారు. మీలో ప్రతీ ఒక్కరూ నాకు ముఖ్యమే. అందువల్ల ఇవాళ మీలో ఎవరికైనా కష్టంగా, ఇబ్బందికరంగా అనిపిస్తే..మీరెలా ఫీల్ అవుతున్నారో నాకు తెలుసు. కాబట్టి నా ప్రేమను, ఎనర్జీని మీకు పంపిస్తున్నా. ఒక టైంలో ఒక అడుగు సరైంది. మీరు క్షేమంగానే ఉంటారని మీతో మీరు చెప్పుకుంటూ ఉండండి. ఐ లవ్ యూ ‘ అంటూ సందేశాన్ని పోస్ట్ చేసింది రష్మిక. ఈ పోస్ట్ ఇపుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది.
ప్రస్తుతం అమితాబ్ బచ్చన్ (Good bye) తో కలిసి గుడ్ బై సినిమాలో నటిస్తోంది రష్మిక. దీంతోపాటు సిద్దార్థ్ మల్హోత్రాతో కలిసి నటిస్తోన్న మిషన్ మజ్ను విడుదలకు రెడీ అవుతోంది.