హెబ్బా పటేల్ కథానాయికగా నటిస్తున్న చిత్రం ‘గీత’.‘మ్యూట్ విట్నెస్’ ఉపశీర్షిక. విశ్వ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు సునీల్ కీలకపాత్రధారి. ఈ చిత్ర ఫస్ట్లుక్ను ప్రముఖ దర్శకుడు వి.వి.వినాయక్ విడుదల చేశారు. దర్శకుడు మాట్లాడుతూ ‘నా గురువైన వినాయక్గారు ఫస్ట్లుక్ను విడుదల చేయడం ఆనందంగా ఉంది. వినూత్న కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కించాం. కథ, కథనాలు ఆకట్టుకుంటాయి. అనాథల కోసం పోరాడే మూగ యువతిగా హెబ్బా పటేల్ పాత్ర చాలెంజింగ్గా ఉంటుంది. సాయికిరణ్ ప్రతినాయకుడిగా కనిపిస్తారు’ అని చెప్పారు. సూర్య, లలిత, ప్రియ, మీనా కుమారి, జబర్దస్త్ అప్పారావు, దుర్గారావు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: క్రాంతికుమార్, సంగీతం: సుభాష్ ఆనంద్, కథ, స్క్రీన్ప్లే, దర్శకత్వం: విశ్వ.