ప్రముఖ డబ్బింగ్ కళాకారుడు శ్రీనివాస మూర్తి (52) ఈ ఉదయం చెన్నైలో గుండెపోటుతో కన్నుమూశారు. 1990లో కెరీర్ ప్రారంభించిన ఆయన వెయ్యికి పైగా చిత్రాలకు డబ్బింగ్ చెప్పారు. తెలుగులో ప్రతి నాయకులకు, తమిళం, హిందీ, కన్నడ వంటి ఇతర భాషల నుంచి తెలుగులోకి అనువాదమయ్యే చిత్రాల హీరోలకు డబ్బింగ్ చెప్పేవారు.
దక్షిణాది హీరోలు సూర్య, విక్రమ్, అజిత్, ఉపేంద్రతో పాటు బాలీవుడ్ స్టార్స్ షారుఖ్, సల్మాన్ వంటి హీరోలకు ఆయన గొంతు బాగా సరిపోయేది. ఆయన ఆకస్మిక మరణం చిత్ర పరిశ్రమలో విషాదం నింపింది.