Gaama Awards | నాలుగవ ‘గామా’ అవార్డ్స్ వేడుక దుబాయ్లోని జబిల్ పార్క్లో మార్చి 3న వైభవంగా జరుగనుంది. ఏఎఫ్ఎం ప్రాపర్టీస్ సారథ్యంలో గామా అవార్డ్స్ అధ్యక్షుడు కేసరి త్రిమూర్తులు ఈ వేడుకను నిర్వహించనున్నారు. శుక్రవారం హైదరాబాద్లో ఈ వేడుకకు సంబంధించిన కర్టెన్ రైజర్ కార్యక్రమం ఘనంగా జరిగింది.
అవార్డు జ్యూరీ ఛైర్మన్గా వ్యవహరిస్తున్న సంగీత దర్శకుడు కోటి, జ్యూరీ సభ్యులు వి.ఎన్.ఆదిత్య, రఘు కుంచె, నిర్మాత డీవీవీ దానయ్య, దర్శకులు సాయిరాజేశ్, ప్రసన్న, హీరోయిన్ డింపుల్ హయతి, గామా సీఈవో సౌరభ్, ఏఎఫ్ఏం ప్రాపర్టీస్ సునీల్, ఫణి మాధవ్ ఈ కార్యక్రమంలో పాల్గొని అవార్డు ట్రోఫీని లాంచ్ చేశారు. కొవిడ్ కారణంగా మూడేళ్లు ఈ వేడుకకు గ్యాప్ వచ్చిందని, ఈ సారి టాలీవుడ్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ వేడుకను కేసరి త్రిమూర్తులు నిర్వహించనున్నారని, 2021, 22, 23 సంవత్సరాలకు చెందిన చిత్రాల నుంచి వివిధ కేటగిరీలకు అవార్డులు అందజేయనున్నామని జ్యూరీ చైర్మన్ సంగీత దర్శకుడు కోటి తెలిపారు.