Drishyam 3 | మలయాళ సూపర్ స్టార్ మోహన్లాల్, సెన్సేషనల్ డైరెక్టర్ జీతు జోసెఫ్ కాంబినేషన్లో వచ్చిన మోస్ట్ అవేటెడ్ సస్పెన్స్ థ్రిల్లర్ ‘దృశ్యం 3’ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. థియేటర్లలోకి వచ్చిన కేవలం మూడు రోజుల్లోనే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 100 కోట్ల మార్కును దాటేసి సరికొత్త రికార్డు సృష్టించింది. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం మూడో రోజు ముగిసే సమయానికి ఈ చిత్రం గ్లోబల్ వైడ్గా ఏకంగా రూ. 117.17 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించడమే కాకుండా, మలయాళ చిత్ర పరిశ్రమలో అత్యంత వేగంగా వంద కోట్ల క్లబ్లో చేరిన రెండవ సినిమాగా సరికొత్త చరిత్ర లిఖించింది.
బాక్సాఫీస్ లెక్కల విషయానికి వస్తే ఇండియాలో ఈ సినిమా ఇప్పటివరకు రూ. 40.60 కోట్ల నెట్ వసూలు చేయగా, మొదటి రోజుతో పోలిస్తే శని, ఆదివారాల్లో కలెక్షన్లు భారీగా పుంజుకున్నాయి. విదేశాల్లో కూడా ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతుండటంతో ఓవర్సీస్ మార్కెట్లోనే ఏకంగా రూ. 70 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. ఎప్పటిలాగే మలయాళ వెర్షన్ రూ. 11.65 కోట్ల నెట్ కలెక్షన్లతో టాప్లో నిలవగా, తెలుగు, తమిళ, కన్నడ వెర్షన్లు కూడా మంచి వసూళ్లను సాధిస్తున్నాయి. మిశ్రమ సమీక్షలు వచ్చినప్పటికీ జార్జ్కుట్టి పాత్రపై ఉన్న క్రేజ్ ప్రేక్షకులను థియేటర్లకు పరుగులు పెట్టిస్తుండటంతో కేరళలో దాదాపు 67% పైగా అక్యుపెన్సీతో థియేటర్లు హౌస్ఫుల్ బోర్డులతో దర్శనమిస్తున్నాయి.
ఈ ఘన విజయంపై మోహన్లాల్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ, గడిచిన 13 ఏళ్లుగా జార్జ్కుట్టి కుటుంబంపై ప్రేక్షకులు చూపిస్తున్న ప్రేమ, నమ్మకానికి చేతులెత్తి మొక్కుతున్నానని అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు. ఆశీర్వాద్ సినిమాస్ బ్యానర్పై ఆంటోనీ పెరుంబావూర్ నిర్మించిన ఈ సినిమాలో మీనా, అన్సిబా, ఎస్తేర్ అనిల్ కీలక పాత్రలు పోషించారు.