పరశురాం డైరెక్షన్ లో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు చేస్తున్న చిత్రం సర్కారు వారి పాట. ఆగస్టు 9న మహేశ్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేయనున్నారు మేకర్స్. ఈ సినిమా పూర్తవగానే త్రివిక్రమ్ శ్రీనివాస్ చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకెళ్లబోతున్నాడు మహేశ్. ఇక ఈ ప్రాజెక్టుకు సంబంధించిన కీలక అప్ డేట్ ఒకటి ఫిలింనగర్ లో చక్కర్లు కొడుతోంది.
పుట్టినరోజున మహేశ్ అభిమానులు డబుల్ బొనాంజా గిఫ్ట్ అందుకోనున్నారా..? అంటే అవుననే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. ఆగస్టు 9వ తేదీ రోజునే మహేశ్ 28వ ప్రాజెక్టును అధికారికంగా లాంఛ్ చేయాలని త్రివిక్రమ్ అనుకుంటున్నట్టు ఫిలింనగర్ సర్కిల్ టాక్. ఇదే నిజమైతే మహేశ్ ఫ్యాన్స్ కు పండగే అన్నమాట. సర్కారు వారి పాట శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మిస్తోన్న ఈ చిత్రంలో కీర్తిసురేశ్ హీరోయిన్ గా నటిస్తోంది.
ఇవి కూడా చదవండి..
సినిమాలకు యువ హీరో గుడ్బై..?
ఇంటి పేరు తెచ్చిన తంటా..కరణ్ కుంద్రాకు చిక్కులు
బాలకృష్ణను భయపెట్టేది ఏంటో తెలుసా..?
నారప్పలో ఆ విషయం వివాదమయ్యేనా?
‘బంగార్రాజు’కు కృతిశెట్టి రెమ్యునరేషన్ ఎంతంటే..?
రాజ్ కుంద్రా పోర్న్ రాకెట్.. వీడియోలు ఎక్కడ తీశారు? ఎలా అప్లోడ్ చేశారు?