Rakul Preet Singh | రకుల్ ప్రీత్ సింగ్ పెండ్లి దగ్గరపడింది. తన ప్రియుడు జాకీ భగ్నానీతో ఈ నెల 21న మూడు ముళ్లు వేయించుకోనుంది. గోవాలో రంగరంగ వైభవంగా వీరి పెండ్లి జరగనుంది. ఈ సందర్భంగా మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన లైఫ్ జర్నీని గుర్తు చేసుకుంది. మోడలింగ్ నుంచి కెరీర్ మొదలు పెట్టి స్టార్ హీరోయిన్గా ఎదగడానికి పడిన కష్టాలను, ఆ సమయంలో తనకు అండగా నిలబడిన వారిని తలచుకుంది. ఈ క్రమంలో తను మొదట అందుకున్న పారితోషికం వివరాలను కూడా వెల్లడించింది.
తన కెరీర్ మోడలింగ్తో ప్రారంభమయ్యిందని రకుల్ ప్రీత్ సింగ్ గుర్తు చేసుకుంది. మోడలింగ్ సమయంలో తాను మొదటగా రూ.5వేల రెమ్యునరేషన్ను అందుకున్నట్లు తెలిపింది. మోడలింగ్లో ఓనమాలు మొదలుపెట్టినప్పటి నుంచి ఈ స్థాయికి చేరుకోవడానికి ప్రధాన కారణం తన తల్లిదండ్రులు, సన్నిహితులు మాత్రమేనని చెప్పింది. ముఖ్యంగా తాను ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పటి నుంచి తనకు 25 ఏండ్ల వచ్చే దాకా వాళ్ల అమ్మ ఎప్పుడూ తోడునీడగా ఉందని రకుల్ తెలిపింది. అదే వాళ్లు తనకు అండగా లేకపోయి ఉంటే ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి వచ్చేదని చెప్పుకొచ్చింది.
ఒకప్పుడు టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా ఎదిగిన రకుల్ ప్రీత్ సింగ్కు తెలుగులో చాలాకాలంగా ఒక్క హిట్టు కూడా లేదు. రారండోయ్ వేడుక చూద్దాం సినిమా తర్వాత ఆమె నటించిన ఒక్క సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర మ్యాజిక్ చేయలేకపోయింది. దీంతో తెలుగు సినిమాలకు గుడ్బై చెప్పి బాలీవుడ్పై ఫోకస్ చేసింది. మధ్యమధ్యలో తమిళంలోనూ కొన్ని చిత్రాలు చేసింది. రీసెంట్గా శివకార్తికేయన్తో కలిసి ఆయలాన్ సినిమాలో నటించి మెప్పించింది. ప్రస్తుతం రకుల్ చేతిలో ఇండియన్ 2తో పాటు మేరీ పత్నీ కా రీమేక్ అనే బాలీవుడ్ చిత్రం ఉంది.