Geeta Arts Production House | దక్షిణాది అగ్ర నిర్మాణ సంస్థలలో గీతా ఆర్ట్స్ ఒకటి. అల్లు అరవింద్ నిర్వాహకుడిగా వ్యవహరిస్తున్న ఈ సంస్థ ఐదు దశాబ్ధాలుగా సక్సెస్ ఫుల్ ప్రొడక్షన్ హౌస్గా కొనసాగుతుంది. కేవలం నిర్మాణ రంగంలో మాత్రమే కాకుండా డిస్ట్రిబ్యూషన్ రంగంలోనూ విజయ యాత్రను కొనసాగిస్తుంది. దక్షిణాదినే కాకుండా ఉత్తరాదిన కూడా పలు సినిమాలు నిర్మించి సక్సెస్ అయింది. టాలీవుడ్లో సక్సెస్ రేటు అత్యధికంగా ఉన్న నిర్మాణ సంస్థలలో ఇది కూడా ఒకటి. ఈ బ్యానర్ నుండి సినిమా వస్తుందంటే మినిమం గ్యారెంటీ అనే భావన ప్రేక్షకులలో ఉంది. ఇదిలా ఉంటే ఈ బ్యానర్కు ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా.
గీతాఆర్ట్స్ బ్యానర్ను అల్లు రామలింగయ్య 1972లో స్థాపించారు. అయితే ఈ బ్యానర్కు ఆ పేరు ఎలా వచ్చిందో ఒక సందర్భంలో అల్లు అరవింద్ వెల్లడించాడు. ఈ బ్యానర్ పేరు విని కొంత మంది తనకు గర్ల్ ఫ్రెండ్ ఉండేదని అనుకున్నారని సరదాగా తెలిపాడు. బ్యానర్కు ఏ పేరు పెడదాం అని అల్లు రామలింగయ్య, ఆయన పార్ట్నర్స్ ఆలోచిస్తున్నప్పుడు.. అరవింద్, గీతా ఆర్ట్స్ పేరు బావుంటుందని తెలిపాడట. గీతలో ప్రయత్నం మనది, రిజల్ట్ మన చేతిలో లేదు అనేది అర్థం వస్తుందని అన్నాడట. అది సినిమాలలో ఎక్కువగా వర్తిస్తుందని, నిర్మాతగా నీ ప్రయత్నం నువ్వు చేయడమే తప్ప, రిజల్ట్ మన చేతిలో ఉండదు అని అన్నాడట. అందువల్ల దీనికి గీతాఆర్ట్స్ అని పెడదాం అన్నాను అని తెలిపాడు.
‘బంట్రోతు భార్య’ అనే సినిమా ఈ బ్యానర్లో మొదటి సినిమాగా రూపొందింది. 1974లో వచ్చిన ఈ సినిమాకు దాసరి నారాయణ రావు దర్శకత్వం వహించాడు. మొదటి సినిమానే కమర్షియల్గా మంచి విజయం సాధించింది. కాగా ఇప్పటివరకు ఈ బ్యానర్లో 60కి పైగా సినిమాలు రూపొందాయి. డిస్ట్రిబ్యూషన్లో వేరు వేరు బ్యానర్లతో కలిసి దాదాపు 300పైగా సినిమాలను రిలీజ్ చేసింది. ఇటీవలే రిలీజైన కాంతార, తోడేలు సినిమాలను కూడా గీతాఆర్ట్స్ సంస్థే రిలీజ్ చేసింది.